రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ,మార్చి 21(ప్రతినిధి మాతంగి సురేష్): రంజాన్ పండుగ సందర్భంగా మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ముస్లింల ఈద్గా దగ్గరకు సర్పంచి పాలకు సురేష్ శనివారం వెళ్లి ముస్లిం కుటుంబ సభ్యుల కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతికే రంజాన్ పండుగని అన్నారు. మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ముస్లింల ఈద్గాలకు, కబరస్థానాలకు నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేశ్వర్లు, సుంకరి మల్లేష్, మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ అహ్మద్, షఫీ, నజీర్, ఇమామ్, రెహ్మాన్, రసూల్, తదితరులు పాల్గొన్నారు.



