పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిన నెల రంజాన్
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడమార్చి 21(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ముస్లింల పవిత్ర పండరైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింల సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచి మందుల నాగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల రంజాన్ మాసం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ నెల రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి దానధర్మాలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డ్ మెంబర్ ప్రేమ్ చంద్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.



