మోడీ సభకు తరలిన బిజెపి శ్రేణులు
:జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన
:బిజెపి రాష్ట్ర నాయకులు డా, మల్లెబోయిన అంజి యాదవ్
Mbmtelugunews//కోదాడ, మే 10(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రదాని నరేందర్ మోడీ బహిరంగ సభకు కోదాడలో పార్టీ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు అధిక సంఖ్యలో హైదరాబాదుకు తరలి పేరడే గ్రౌండ్ లో జరుగు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోసూర్యపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, బీజేపీ సీనియర్ నాయకులు బొలిశెట్టి క్రిష్ణయ్య, మునగాల మండలం బీజేపీ అధ్యక్షుడు మైలార్ శెట్టి నాగేశ్వరరావు, చిలుకూరు మండల బీజేపీ అధ్యక్షులు పారెల్లి మహేష్, అనంతగిరి మండల బీజేపీ అధ్యక్షులు చింతకుంట్ల సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు.



