కోదాడ పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
:ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓయూ జేఏసీ నాయకులు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 95(మనం న్యూస్): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని యాదవ బజార్లో గల శ్రీకృష్ణుడి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఓయూ జేఏసీ నాయకులు ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్.

ఈ సందర్భంగా, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువత ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాదాల ఉపేందర్, బిఎస్ఎఫ్ నాయకులు కర్ల ప్రేమ, వెంకటనారాయణ, సతీష్, నాగేశ్వరరావు, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



