బిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదె వీరారెడ్డి నీ పరామర్శించిన బొల్లం
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): బిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదె వీరారెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం అడ్లూరు లోని ఆయన నివాసంలో పరామర్శించారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి సమాచారం కొరకు ఆర్టిఐ దావా వేయగా గ్రామ సభ జరుగుతున్న సమయం లో కొందరు కాంగ్రెస్ నాయకులు వీరారెడ్డిపై రాళ్ళతోదాడి చేసి గాయపరచగా ప్రస్తుతం మంచానికే పరిమితం కాగా నేడు పరామర్శించి భరోసా కల్పించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపిపి చింతా కవిత, కాపుగల్లు గ్రామ సర్పంచి దొంతగాని అప్పారావు, అడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి, పెదపోలు కొండలు, కాపుగల్లు గ్రామ శాఖ అధ్యక్షుడు బాల బోయిన పాపారావు, బాల బోయిన వెంకటేశ్వర్లు, ఓర్సు గోపి, బాలేబోయిన వేలాద్రి, పొట్ట కిరణ్, కూచిపూడి మాజీ సర్పంచి శెట్టి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.



