లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ హర్షం
:బిల్లు ఆమోదం తో మహిళల కు రాజ్యాధికారం మరింత భాగస్వామ్యం….
:మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు పునాది……..
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం తో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో 33 శాతం స్థానాలు మహిళలకు చట్ట బద్దంగా దక్కుతాయన్నారు.బిల్లు ఆమోదం తో మహిళల కు రాజ్యాధికారం లో మరింత భాగస్వామ్యం దక్కుతుందన్నారు.మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు పునాది అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు మంచి అవకాశం అన్నారు. దేశ యావత్ మహిళా లోకం నేడు ఆనందోత్సవాల్లో ఉందన్నారు.



