సామాజిక కార్యకర్త ముసుగులో
అసత్య ప్రచారం మానుకోవాలి….
:మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్ల పై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదు.
:కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు…
Mbmtelugunews//కోదాడ, జూన్ 02: సోషల్ మీడియా వేదికగా సామాజిక కార్యకర్త ముసుగులో కోదాడ అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు హెచ్చరించారు.. మంగళవారం అయన మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా సామాజిక కార్యకర్త పేరుతో అసత్య ప్రచారం నిర్వహించడం హేమమైన చర్యని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వైద్యశాల, కోర్టు భవనం మున్సిపల్ కార్యాలయము, ఇరిగేషన్ కార్యాలయము, బాలాజీ నగర్ లో కేంద్రీయ విద్యాలయం, చిలుకూరు మండల పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవసాయ అవసరాల నిమిత్తం చెక్ డ్యాములు, నియోజకవర్గ పరిధిలో డబుల్ రోడ్ల నిర్మాణం, మున్సిపల్ పరిధిలో డ్రైనేజీలు, సిసి రోడ్లు ఇలా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి మీకు కనపడక పోగా… కోదాడ మున్సిపాలిటీ పై అసత్య ప్రచారం చేయడం.. మానుకోవాలని హెచ్చరించారు. 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందని అన్నారు. సోషల్ వర్కర్ ముసుగులో అసత్య ప్రచార నిర్వహిస్తే , పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



