సూర్యాపేట,జులై 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జిల్లాలో సిఎంఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి ఎఫ్సిఐకి అందించాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ నందు రైస్ మిల్లర్లు,ఎఫ్సీఐ,సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో మిల్లర్లకు కేటాయించిన సిఎంఆర్ డెలివరీ చేసేందుకు సరిపడా గోదాంలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్ దృష్టికి మిల్లర్లూ తీసుకురావడంతో బియ్యం నిల్వలకు సరిపోను గోదాములను ఏర్పాటు చేయాలని ఎఫ్సిఐ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.సిఎంఆర్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.రబి,ఖరీఫ్ సీజన్ లకు 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ కావాల్సి ఉందని ముందుగా 77 వేల మెట్రిక్ టన్నుల నిల్వలకు సరిపోను స్థలాన్ని కేటాయిస్తామని మిగిలిన బియ్యం నిల్వలకు త్వరలో గోదాములు కేటాయిస్తామని ఎఫ్సిఐ అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు.ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సోమ నరసయ్య మాట్లాడుతూ వర్షాలు,హమలిల కొరత,రైల్వే వేగన్స్ సకాలంలో రాకపోవడంతో సిఎంఆర్ బియ్యాన్ని సకాలంలో అందించలేకపోతున్నామని తెలిపారు.ఎఫ్సిఐ అదికారులు తరచుగా తనిఖీలు చేయడంతో దిగుమతులలో జాప్యం జరగడంతోనే ప్రభుత్వం కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాన్ని మిల్లర్లూ చేరుకోవడం లేదని ఈ సందర్బంగా కలెక్టర్ కు తెలిపారు. సెప్టెంబర్ చివరి వరకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాల మేరకు అందిస్తామని మిల్లర్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ సిఐ ఏరియా మేనేజర్ వరుణ్ సూద్,జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏ వెంకట్ రెడ్డి,హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్ రెడ్డి,డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య,సివిల్ సప్లై డిఎం రాంపతి,పుల్లయ్య రైస్ మిల్లర్ యజమానులు ఎఫ్ సిఐ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు.:బియ్యం డెలివరీలో ఇబ్బందులు లేకుండా చూడాలి.:నిల్వలకు సరిపోను గోదాంలను ఏర్పాటు చేయాలి.
RELATED ARTICLES