కోదాడ,ఆగష్టు 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఐజేయు నుండి టియుడబ్ల్యూజె 143 యూనియన్ కి చేరినా జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ మాత్రమేనని జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అధ్యక్షులు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సంఘం నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకొని, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ నందిపాటి వెంకన్న జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అధ్యక్షులు పడిశాల రఘు ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ …ప్రభుత్వ వారధిగా ఉంటూ నిత్యం జర్నలిస్టు సమస్యలపై మరియు ఇండ్ల స్థలలకై పోరాడుతున్న యూనియన్ టి డబ్ల్యూ జే హెచ్ 143 మాత్రమే అన్నారు.యూనియన్ యొక్క విధి విధానాలకి ఆకర్షితుడై యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం నూతనంగా సభ్యత్వం తీసుకున్న వెంకన్నకు పలువురు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ,టీయూడబ్ల్యూజే హెచ్ 143 నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్,ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ జిల్లా గౌరవ అధ్యక్షులు సోమపంగు గణేష్,నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పూర్ణచంద్రరావు,ఎలక్ట్రాన్ మీడియా గౌరవ సలహాదారులు ఏబీఎన్ గాంధీ,ఎలక్ట్రాన్ మీడియా ఉపాధ్యక్షులు చింతల పని సురేష్,లావుడియా రమేష్,నూకపంగు గోపాలకృష్ణ,తంగేళ్లపల్లి లక్ష్మణ్,షేక్ నజీర్,మల్లయ్య, హరిష్ తదితరులు పాల్గొన్నారు…
ఐజేయు నుండి టియుడబ్ల్యూజె 143 యూనియన్ కి వరస చేరికలు.:యూనియన్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ జర్నలిస్టు నందిపాటి వెంకన్న.
RELATED ARTICLES



