కోదాడ,ఏప్రిల్ 14(mtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో బొల్లెపంగు రాజేందర్,గుండెపంగు సుధాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ.. ఒకే సిరా చుక్క తోటి కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన జ్ఞాన యోధుడు, స్త్రీల హక్కుల కోసం తన పదవిని సైతం త్రుణ ప్రాయంగా వదిలిన త్యాగధనుడు,చదువుతోనే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మహా మేధావి, వెలివాడలో బ్రతుకుతున్న జీవితాల్లో వెలుగులు నింపిన నీతి సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, యావత్తు దేశం కూడా ఆయన బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో బుర నరసింహారావు,అంబేద్కర్ యుత్ అధ్యక్షులు చిలక వినయ్,కందుకూరి సుధాకర్,లాజర్,బొల్లెపంగు వేణు,కందుకూరిసురేష్,గుండెపంగు శ్రీనాథ్,శ్రీకాంత్,మీసాల కిరణ్,సతీష్,భాను,రాఖీ,సాయి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
RELATED ARTICLES



