సిడ్డపేట (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)చిన్న కోడూరు మండలం:లోకసభ ప్రధాన ప్రతీపక్ష నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు చిన్నకోడూరు మండల కేంద్రం లో మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఢిల్లీ బీజేపీ నాయకుడు తన్విందర్ సింగ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 139 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ప్రతి పక్ష నాయకుడిని దేశం కోసం ప్రాణలు అర్పించిన కుటుంబం లో పుట్టిన రాహుల్ గాంధీ దేశ చరిత్ర లో ఎవ్వరు చేయని విధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర పేరు తో పాదయాత్ర చేసి ప్రతీ పేద వాడి సమస్యలు తెలుసుకొన్నా రాహుల్ గాంధీ గారిని లోక్ సభలో ఎదరుకునే దమ్ము లేక ఈ బీజేపీ నాయకులు కండ కావరం తో రాహులు గాంధీ గారిని చంపుతామనీ మీ నాయనమ్మ కు పట్టిన గతే మీకు పడుతుంది అని బీజేపీ నాయకులు మాట్లాడడాన్ని తీవ్రంగా కండించారు. మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తలుచుకుంటే ప్రతీ కార్యకర్త మానవ బాంబు లాగా మరి మీ బీజేపీ నాయకులను దేశం లోనే లేకుంటే చేస్తామని హెచ్చరించారు వెంటనే మోడీ గారు, హోం శాఖమంత్రి అమిత్ షా లు స్పందించి నిందుతుడిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు లేని పక్షం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, సెక్రటరీ కోరిమి రాజు, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్,మండల ప్రధాన కార్యదర్శి బర్ల స్వామి,sc సెల్ జిల్లా కార్యదర్శి పొన్నాల రాజేష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి sc సెల్ మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా, ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి గుండు వెంకటేష్, నాయకులు మందపల్లి సంపత్,కొలను గణేష్, నక్క రాజు, కొమ్ము రాజు, ఓగులాపూర్ భాస్కర్,బాలేపు రాజిరెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు



