అక్షరం ఆర్థికం ఆరోగ్యం
:కోదాడలో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): పేదల ఐఏఎస్ గా పేరుగాంచిన ఎస్సార్ శంకరన్ జయంతిని కోదాడ స్వేరోస్ ఘనంగా నిర్వహించారు. నిరుపేదల పిల్లల చదువుల కోసం గురుకులం వ్యవస్థ ను ఆవిష్కరించిన గురుకులాల పితామహుడు ఎస్సార్ శంకరన్ జయంతినే స్వేరోస్ డే నిర్వహించడం జరుగుతుంది. ఆకాశమే హద్దుగా అవకాశాలు సృష్టించుకొని ఎవరెస్టు అంత ఎత్తుకు ఏదిగేలా ప్రతిఒక్కరిలో స్వేరోస్ నెట్వర్క్ ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గురి దుర్గయ్య స్వేరోస్, శ్రీను స్వేరోస్ (లెక్చరర్), స్వేరో సీనియర్స్ కొండ భీమయ్య గౌడ్,చడపంగు రవికుమార్, యలమర్తి వెంకటేశ్వర్లు, మంద వెంకటేశ్వర్లు, వీరాస్వామి స్వేరో,శిల్పి సుధాకర్, పాముల రాకేష్ స్వేరో, రణపంగు అజయ్, కొండపల్లి శ్రీకాంత్, వినయ్, నాగార్జున, స్వేరోస్ అభిమానులు పాల్గొన్నారు..



