మహంకాళి వెంకటేశ్వర్లు ని సన్మానించిన కౌన్సిలర్ మామిడి రామారావు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 95(ప్రతినిధి మాతంగి సురేష్):గత 35 సంవత్సరములుగా కొమరబండ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్మెంట్ అయిన మహంకాళి వెంకటేశ్వర్లు ని కొమరబండ 10వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు అధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహంకాళి వెంకటేశ్వర్లని శాలువా బొకేతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో సంపేట సీతయ్య, పైడిమర్రి వెంకన్న, బత్తుల అరుణ్, జలంధర్, లింగరాజు, యాదగిరి, అఖిల్, కార్తీక్, గోపి, విష్ణు, రాజు, ఉపేందర్, పాషా, నరేందర్ పాల్గొన్నారు.



