ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ డిపోలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపిన ఆశాజ్యోతి, సూర్యుడు భారతరత్న, భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ డిపో మేనేజర్ శ్రీనివాస రావు, సూపరిండెంట్ నాగిరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ, ఎంపిసి రావు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కోదాడ బస్ స్టేషన్ మేనేజర్ సైదులు, ఎస్సీ, ఎస్టీ రీజియన్ కమిటీ ఉపాధ్యక్షురాలు పులిజ్యోతి, కోదాడ డిపో ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు పులి అంజలి, ఉపాధ్యక్షురాలు ఖమ్మంపాటి సుధారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లపల్లి రాంబాబు, కార్యదర్శి కోలంపూడి రత్నం, ఆయా పదవులలో కొలువైయున్న అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కంట్రోలర్లు, సూపర్వైజర్లు, ఏడీసీలు, గ్యారేజ్ సోదరులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు అందరూ పాల్గొన్నారు.



