జీపీవోలుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలు.. తెలంగాణ ప్రభుత్వం జీవో.
Mbmtelugunews//హైదరాబాద్,మార్చి 30(ప్రతినిధి మాతంగి సురేష్):గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. విధివిధానాలు, అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది.
డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించనుంది. ఇంటర్తో పాటు ఐదేళ్లు వీఆర్వో లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు.స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.