క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ద్రోహర్ పడతాయి.
: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
Mbmtelugunews//కోదాడ, జులై 24(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూర్యాపేట జిల్లా స్థాయి టోర్నమెంట్ ఈనెల 25.26 తేదీలలో అండర్ 17 బాయ్స్ మెగా మోడ్రన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కబడ్డీ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్లను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులు లకు ఈ కమిటీ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కబడ్డీ పోటీలను సద్వినియోగం చేసుకొని పుట్టిన గ్రామానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి ఎం సైదిరెడ్డి పాల్గొన్నారు.



