ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి నివాళులు అర్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓ బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పంది తిరుపతయ్య, బడుగ సైదులు, ఎస్ కే జానీ, సోమపొంగు వెంకటయ్య, బాయ్, షేక్ పాషి బాయ్, రెడపంగు కృష్ణ, భూక్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.



