బహిరంగ వ్యర్థాలను వరికోయలను కాల్చవద్దు
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, మే 30(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిల చెన్నకేశవపురం గ్రామంలో బహిరంగ వ్యర్థాలకు, పంట పొలాలకు మంట పెట్టొద్దని రైతు కూలీలకు అవగాహన సదస్సు శనివారం గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచి గోసుల రాజేష్ పాల్గొని మాట్లాడుతూ రైతులు చెత్త వరిమొత్తలు వాటిని శుభ్రం చేయాలని, కాలబెట్టాలని మంటలు పెట్టడం ద్వారా పంట పొలాలు నాశనం అవుతాయని కాలుష్యం పెరిగిపోతుందని రైతులకు ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని అలాంటి పొరపాట్లు ఎవరూ చేయొద్దని ఎవరైనా చేస్తే వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని అన్నారు. రైతుల ఎవరైనా పంట పొలాలకు మంట పెట్టొద్దు అని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.



