కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ వీరాభిమాని గుండు చేయించుకొని మొక్కు చెల్లించుకున్నాడు. కోదాడ మండల పరిధిలోని బిక్యతoడకు చెందిన గుగులోతు వీరన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కోదాడ,హుజుర్ నగర్ నుండి ఉత్తమ్ పద్మావతి రెడ్డి,

ఉత్తమ్ కుమార్ రెడ్డి లు భారీ మెజారిటీతో గెలిస్తే ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మినర సింహా స్వామి ఆలయం వద్ద గుండు చేయించుకుంటా నని మొక్కు కున్నాడు. కోరిక నెరవేరడం తో అతను గురువారం ఆలయం వద్ద తన మొక్కులు చెల్లించుకున్నాడూ. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నాడు.



