కోదాడ,డిసెంబర్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు భారత్ ఆర్ట్ అకాడమీ ల ఆధ్వర్యం లో లార్జెస్ట్ కూచిపూడి డాన్స్ లెసన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు.ఈ పోటీల్లో కోదాడ కు చెందిన నాట్యగురువు తిరుపతి స్వామి శిష్య బృందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది.లండన్ కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సీఈవో రిషికేష్,తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.బృందం లో బాల నృత్య కళాకారిణులు

అమృషలక్ష్మి,కుసుమ,లౌక్య,అక్షయ,సౌమ్య,మనోజ్ఞ,సాన్విక,యామిని,ఉమాశ్రావణి లు అద్భుత ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా నాట్యాగురువు తిరుపతి స్వామీ ని ఆయన శిష్య బృందా న్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు గుడిపూడి శ్రీధర్ రేవతి,కిరణ్మయి,శైలజ,లక్ష్మి నారాయణ,డాక్టర్ శిరీష,డాక్టర్ కరుణ్ కుమార్,రమేష్,మమత,రాంబాబు,సుహాసిని,శైలజ,స్రవంతి పాల్గొన్నారు .



