Friday, December 26, 2025
[t4b-ticker]

ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారు

కోదాడ,ఫిబ్రవరి 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వార్షిక పరీక్షలు, ప్రవేశపరీక్షలు దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది.కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో,తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు.అలాంటి విద్యార్థులలో మంచి మార్కులు తెచ్చుకోగలమని నమ్మకం,విశ్వాసం ఉంటుంది. ఉపాధ్యాయులలో,అధ్యాపకులలో,తల్లిదండ్రులలో అలాంటి నమ్మకమే ఉంటుంది.కానీ ఫిబ్రవరి,మార్చి రాగానే  పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ వారిలో కొందరిలో ప్రవర్తనలో మార్పు ప్రారంభం అవుతుంది.
ఫ్రీ ఫైనల్‌  పరీక్షలు రాసేటపుడు తెలిసిన అంశాలు కూడా సరిగా గుర్తురావటం లేదు.వారిలో ఆందోళన మొదలవుతుంది.సబ్జెక్ట్‌ లో ఎంతో పట్టు  ఉన్నప్పటికీ పరీక్షల సమయంలో ఆ అంశాలు గుర్తుకు రావడమే ముఖ్యం. దీనికి కారణం పరీక్షలనగానే ఒత్తిడి పెరిగిపోతుంది.కనిపించిన ప్రతి వారు కూడా ఎగ్జామ్స్‌ ఎలా ప్రిపేర్‌ అవుతున్నావు.ఇప్పుడు రాసే ఎగ్జామ్స్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కదా అని అడిగే సరికి అప్పటి వరకూ ఉన్న దైర్యం కాస్తా సన్నగిల్లుతుంది.సరిగా చదవలేమో అనే కంగారు.అయ్యో నేను చదివినవి పరీక్షా పత్రంలో రాకపోతె ఎలాగా అని,చదివినవి ఆ సమయంలో గుర్తుకు రాకపోతే నా పరిస్థితి ఏమిటీ ఇలా అనవసర భయాలు వెంటాడుతుంటాయి.సంవత్సరం చదివినదంతా ఎగ్జామ్స్‌ సమయంలో రివిజన్‌ చేసుకొని,పై చదువులకు భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను రాయడం తేలికైన పనేం కాదు.

పరీక్షల ఒత్తిడి కలగడానికి ప్రధానమైన కారణాలు

ప్రస్తుత విద్యావిధానం పరీక్షల అనంతరం పై చదువులకు వెల్లాలంటే  రాష్ట్ర,జాతీయ స్థాయిల్లో ఎంట్రన్స్‌ పరీక్షలు రాయాల్సిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ కోర్సుల్లోనైనా  సీటు సంపాదించాలంటే తప్పనిసరిగా మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సిందే.అందరూ విద్యార్థికి టార్గెట్‌ ఇచ్చే వారే తల్లిదండ్రులూ,పాఠశాల యాజమాన్యాలు,బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ చదివే విద్యార్థికి టార్గెట్‌ ఇచ్చే వారే ఆ టార్గెట్‌ ను అందుకోవడానికి,వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి  విద్యార్థి నానా కష్టాలు పడుతుంటాడు.ప్రస్తుత పరిస్థితులల్లో

‘మీరేమీ ఫర్వాలేదు, ఆందోళన పడవద్దు’

అని ధైర్యం  చెప్పాల్సిన తల్లిదండ్రులే
తమ పిల్లలు సరిగా పరీక్ష రాస్తారో లేదో, ర్యాంకు వస్తుందో రాదోనని ఆందోళనలకు గురవుతుంటారు. తల్లిదండ్రుల ఆందోళనలతో విద్యార్థి మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.

*అనవసర ఆలోచనలు:*
తన తోటి  స్నేహితులంతా  మార్కులు, ర్యాంకుల కోసం తీవ్రంగా పడుతున్న శ్రమ, ప్రొద్దున రాత్రి చదువుతున్న తీరును చూస్తూ వారి కంటే ఎక్కువ మార్కులు సాధించాలని, మార్కులు సాధించకపోతే జీవితం అంతా ఏమవుతుందోనన్న ఆలోచనలూ వెంట పడుతుంటాయి.
ఓటమి భయం: గతంలో ఏదైనా సబ్జెక్ట్‌ లో తక్కువ మార్కులు రావడం, ఆ సబ్జెక్ట్‌ చాలా కఠినంగా ఉంటుంది ఎప్పుడు రాసినా తక్కువ మార్కులే వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇలాగే మళ్ళీ విఫలమవుతానేమోనని భయం. సమయాభావం: చాలామంది విద్యా సంవత్సరమంతా ఎంజాయ్‌ చేసి పరీక్షలు దగ్గరపడినపుడు పుస్తకాలను ముందు పెట్టుకుని చదవడం ప్రారంభిస్తారు. ఈ కొద్దిరోజుల్లో ఇంత సిలబస్‌ పూర్తిచేయలేమోమనే ఆందోళన, ఒత్తిడి మొదలవుతాయి. నెగెటివ్‌ ఆలోచనలు: పరీక్షలలో తెలిసిన ప్రశ్నలు వస్తాయో రావో, వచ్చినా పేపర్‌ వాల్యువేషన్‌ చేసే వారు మార్కులు సరిగా వేస్తారో, వేయరో అనే ప్రతికూల ఆలోచనలు.
ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం: మంచిగా చదివే విద్యార్థుల్లో సైతం ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల పరీక్షలు సమీపిస్తుండగానే భయం, ఒత్తిడీ మొదలవుతాయి. వాటిని అధిగమించడానికి ఈ క్రింది వాటిని ఫాలో అయితే పరీక్షలు రాయడం, మార్కులు సాధించడం తేలిక అవుతుంది.
*భయం వీడితే విజయం మీదే*

*ఉల్లాసం ఉత్సాహం:* పరీక్షల సమయంలో విద్యార్థులు ఉల్లాసం, ఉత్సాహంగా ఉండాలి. మనసును హాయిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. 
*సబ్జెక్ట్‌ మీద పట్టు:* ప్రిపరేషన్‌ మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు మీద పట్టు కోసం కృషి చేయడం అలవాటు చేసుకోవాలి. ఎంసెట్‌ లాంటి ప్రవేశపరీక్షలు రాయబోయేవారికి సబ్జెక్టు మీద అవగాహన ఎంతో అవసరం.  పరీక్షలు ప్రారంభ సమయం దాకా సిలబస్‌ను అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా చదవాలి. సబ్జెక్ట్‌ లో అనుమానాలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. పరీక్షలప్పుడు వచ్చే సందేహాలు ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తాయి. చదివిన పాఠాల్లో ముఖ్యమైన అంశాలను బులెట్‌ పాయింట్లుగా నోట్‌ చేసుకోవాలి.
*పునఃచరణ ముఖ్యం :* పరీక్షల సమయంలో ప్రతి సబ్జెక్ట్‌ కు తగు సమయం కెటాయించుకుని, ప్రణాళిక ప్రకారంగా   రివిజన్‌ చేసుకోవాలి. గత ప్రశ్నాపత్రాల జవాబులు ప్రాక్టీస్‌ చేయాలి: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలకు నిర్దిష్ట సమయంలో జవాబులు రాయటం మంచిది. దీనివల్ల పరీక్షపై ఉండే భయం తగ్గిపోయి, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో అవగాహన ఏర్పడుతుంది. *శారీరక వ్యాయామం:* రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీకు మీరే బాస్‌ : మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు, పరీక్షలో ఏం చేయాలి అనే దృఢ నిశ్చయంతో పరీక్షకు సన్నద్దం కండి. పరీక్షలో మీరు తీసుకొనే నిర్ణయానికి మీరే బాస్‌ అనే పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు వెల్లాలి.

ఆత్మవిశ్వాసమే ఆయుధం :
చారుగుండ్ల రాజశేఖర్

మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular