Saturday, December 27, 2025
[t4b-ticker]

*నిరుద్యోగులను నిరాశపర్చిన మెగా డిఎస్సీ**:4 లక్షల మందికి 11,062 పోస్టుల నియామకమా:బీఎస్పీ  నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని*

నకిరేకల్,మార్చి02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు.11,062 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.అయితే దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులకు కేవలం 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు.ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు.గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించిందని, మీరు ఏటా రెండు సార్లు చేపట్టాలని మేడి ప్రియదర్శిని కోరారు.నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను పరిశీలించాలని కోరారు.బీఎడ్ చేసిన వారు పాఠశాల విద్యా శాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు.వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి.ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరని అన్నారు.గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించింది.నిజానికి టెట్ సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించాలి.ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది.లేదా టెట్,డీఎస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది.ఆన్లైన్ కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లలో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది.అంటే 70 శాతం పదోన్నతి,30 శాతం డైరెక్టు రిక్రూట్మెంట్.దీని వల్ల బీఎడ్ అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో లతిబిజ్ద్+తిబా దెబ్బతినే ప్రమాదం ఉంది.అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్ను మారిస్తే అందరికీ లాభమైతది.చాలా కాలంగా ఆర్ట్,క్రాప్ట్,మ్యూజిక్,లైబ్రేరియన్,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగి పోయింది.వీళ్లను ఎంత అర్జంటుగా రిక్రూట్ చేస్తే (ప్రతి స్కూల్కు ఒకరు) అంత మంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా,ఆరోగ్యంగా తయారవుతారు.పాఠశాలల్లో మానసిక నిపుణులను ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.డీఎస్సీ 2008 అభ్యర్థులు న్యాయం కోసం తొక్కని గడప లేదు.వారికి పక్క రాష్ట్రంలో న్యాయం జరిగింది.మన దగ్గర కూడా వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయగలరు.గురుకులం ఆశావహులు బ్యాక్ లాగ్ ఖాళీలను ఎలాగైనా నివారించేందుకు ‘అవరోహణ క్రమంలో’ రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారని ఆమె వివరించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular