లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ను కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా అమలుచేయాలి.
ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ,మార్చి 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కోదాడ మాజీ శాసనసభ్యులు,నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు.బుధవారం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నయనగర్ పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం ఎక్స్ రోడ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఎక్స్ ఖమ్మం రోడ్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ….ఎల్ఆర్ఎస్ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్…అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మ్యానిఫెస్టోలో 420 హామీలు,6 గ్యారెంటీలను ఇచ్చారని,కానీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు,కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని అయన డిమాండ్ చేశారు.గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు.గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు,ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడినరు అని ఆయన అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని,లేకుంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు,ఎల్ఆర్ఎస్ బాధితులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



