డిస్టిక్ జడ్జిని కలిసిన నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్
కోదాడ,మే 03(mbmteluhunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట పట్టణంలో జిల్లా కోర్టు నందు ఈరోజు జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి,మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామ శ్రీ లను నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించడం జరిగింది.ఈ సందర్భంగా కోదాడలో నూతన కోర్టు భవనం సముదాయ నిర్మాణ పనులను మరియు పైలట్ ప్రాజెక్టు కింద మంజూరైన శోచాలయాలు (టాయిలెట్స్) త్వరగా నిర్మాణం చేపట్టాలని,సబ్ కోర్టుకు కావలసిన మౌలిక వసతులను కల్పించాలని కోరినారు దానికి వారు స్పందిస్తూ సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఆర్ కె మూర్తి,కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,సరికొండ హనుమంత రాజు,కోడూరి వెంకటేశ్వరరావు,మంద వెంకటేశ్వర్లు,దొడ్డ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



