పోతురాజు రామయ్య మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు
కోదాడ,మే 26(mbmtelugunewsప్రతినిధి మాతంగి సురేష్:పోతురాజు రామయ్య మృతి అల్వాలపురం కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖకు తీరనిలోటు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ కోదాడ మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు.కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోతురాజు రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తన నివాస గృహములో మృతి చెందారు.ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు మృతుని నివాసానికి వెళ్లి పార్థివదేహంపై కమ్యూనిస్టు పార్టీ జెండా కప్పి పూలమాలలతో నివాళులర్పించారు.అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోతురాజు రామయ్య మృత అల్వాలపురం గ్రామశాఖకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని తెలిపారు.అల్వాలపురం లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని వారు పేర్కొన్నారు.నివాళులు అర్పించిన వారిలో మేకల శ్రీనివాసరావు,బత్తినేని హనుమంతరావు,కమ్యూనిస్టు పార్టీ నాయకులు బొల్లు ప్రసాద్,పోతురాజు సత్యనారాయణ,కమతం శ్రీనివాసరావు,మాతంగి గాంధీ,కొండా కోటేశ్వరరావు,కమతం వెంకటయ్య,నిడిగొండ కనకయ్య,బత్తినేని శ్రీనివాసరావు,కంబాల స్వామి,పోతురాజు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



