రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి
కోదాడ,జూన్ 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని ఎంబిఎం ట్రస్టు సభ్యులు అన్నారు.శనివారం కోదాడ తిరుమల హాస్పిటల్ లో కాంపాటి కావ్య జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం వారికి అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన గువ్వల రాము వారికి బ్లడ్ ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది పేదవారికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తం అందించడానికి సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

ఆపద సమయంలో రక్తం ఇచ్చిన రాముకి ఎంబిఎం ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటివరకు ఈ ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు మాతంగి సురేష్,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



