నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తా……
:చైర్పర్సన్ కుసుమకు నాయి బ్రాహ్మణ సంఘం సన్మానం……
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 25(ప్రతినిధి మాతంగి సురేష్): నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు హామీ ఇచ్చారు. బుధవారం కోదాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు ఆలేటి గోపి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు.

వృత్తి పరంగా ఎదురయ్యే కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ తోడుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు ఆలేటి గోపి, సంఘం పెద్దలు సురభి నరసయ్య, తాడేపల్లి గోవిందరావు, ఆలేటి చిన్న సత్యనారాయణ, మాధవరపు సీతారాములు, ఆలేటి వెలగొండ, ఆలేటి వెంకటేశ్వర్లు, గుడిమల్ల శ్రీహరి, వినుకొండ శ్రీనివాస్, సన్నాయిల వీరబాబు, తూముల రాంబాబు, కేతవరపు సైదులు, పిన్నెల్లి మురళి, వెన్నెల శీను, ఆలేటి సహదేవ్, తాడేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.



