నూతన సంవత్సర కాలమానాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): గురువారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో బాప్టిస్ట్ చర్చి పాస్టర్ రెవరెండ్ యేసయ్య నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బాప్టిస్ట్ చర్చి నూతన సంవత్సర క్యాలెండర్ ని వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయటం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరిలో జీవితాల్లో కష్టాలు తొలగి చిరునవ్వుతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్, కోదాడ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యెషయా, కుడుముల రాంబాబు, తమలపాకుల. సైదులు తదితరులు పాల్గొన్నారు.



